News

కవల పిల్లలకు జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్, కంగ్రాట్స్ అంటూ..?

ఆహా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కరుణ ఎంట్రీ ఇచ్చారు.శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కాటమరాయుడు సినిమాలలో ఆమె నటించారు.మొగలి రేకులు, వైదేహి పరిణయం మరికొన్ని సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించారు. అయితే బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కరుణ భూషణ్. ఆహా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర చిత్రాల్లో నటించింది. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన కరుణ.. సీరియల్లలో మాత్రం ప్రధాన పాత్రలు పోషించింది. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలి రేకులు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ పోషించింది. అంతకు ముందు దేవి పాత్రలో లిఖిత నటించగా.. ఆ తర్వాత అదే పాత్రలో కరుణ కనిపించింది.

మొగలిరేకులు, శ్రావణ సమీరాలు, అభిషేకం, వైదేహి పరిణయం ఇలా అనేక సీరియల్స్ చేసింది. మెయిన్ లీడ్ కాకుండా వైదేహి పరిణయం వంటి సీరియల్లో విలన్ రోల్స్ పోషించింది. మ తెలుగులో అనేక సీరియల్స్ చేసిన కరుణా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యింది. అయితే తనకు ఈ ఏడాది కవలలు జన్మించారంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లలు జన్మించేవరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది.

కరుణ భూషణ్ చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకుంది. వీరికి పదేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు కవలకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker