News

టాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత మృతి.

ప్రముఖ నిర్మాత ఆర్.వి. గురుపాదం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. బెంగళూరులోని తన నివాసంలోనే గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన తుది శ్వాస విడిచారు. గురుపాదం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తెలుపుతున్నారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో 25పైగా చిత్రాలను గురుపాదం నిర్మించారు. తెలుగులో వయ్యారి భామలు బగలమారి భర్తలు, పులి బొబ్బిలి సినిమాలకు గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి మరణం మరువకముందే టాలీవుడ్‌ నిర్మాత ఆర్‌.వి గురుపాదం మరణించాడు.

శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా గురుపాదం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. గురుపాదం మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో 25పైగా చిత్రాలను గురుపాదం నిర్మించారు. తెలుగులో వయ్యారి భామలు బగలమారి భర్తలు, పులి బొబ్బిలి సినిమాలకు గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో శ్రీదేవి హీరోయిన్ గా వచ్చిన అకల్ మాండ్ చిత్రానికి గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు.

అంతేకాకుండా పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువదించి రిలీజ్‌ చేశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker