News

తారకరత్నని ఎందుకు విదేశాలకు తీసుకెళ్ళాలి అంటున్నారో తెలుసా..?

తారకరత్న గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్ అయిందని, మొత్తంగా గుండె పని చేయడం లేదని తెలుస్తోంది. గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్స్ ఉండటంతో ఎక్మో ద్వారా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారని సమాచారం. తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న మంచి వ్యక్తి అని మంచి వ్యక్తుల విషయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని ఆమె కామెంట్లు చేశారు.

విదేశాలకు వెళ్లడం స్థానం మార్పు చేయడం వల్ల ఆయనకు బాగయ్యే అవకాశం ఉందని జ్యోతిష్కురాలు అన్నారు.మృత్యుంజయ హోమం చేయడంతో హనుమాన్ చాలీశా చదివితే ఫలితం ఉంటుందని ఆమె అన్నారు. అయితే నిజానికి తారకరత్న వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం వల్లే విదేశాలలో వైద్య చికిత్స చేయించుకుంటే మంచిదని వైద్యులు చెప్పారని సమాచారం.

తారకరత్న త్వరగా కోలుకోవాలంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు చర్చించుకుని మెరుగైన వైద్యం కోసం తారకరత్న విదేశాలకు తరలించనున్నారు. అప్పటికే తారకరత్నకు షుగర్ ఉండడం వల్ల చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని.. సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

తారకరత్న వయసు కేవలం 39 సంవత్సరాలు కాగా ఇండస్ట్రీలో వివాదాలకు కూడా దూరంగా ఉండే హీరోగా పేరు ఉంది. రాజకీయాలలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్న సమయంలోనే ఈ విధంగా జరిగిందని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు.

నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు టాబ్లెట్స్ వాడకుండా కేవలం ఆరోగ్య సూత్రాలను ఫాలో కావడం వల్ల ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker