Health

షుగర్ పేషెంట్స్ ఈ కాయలని గురుపెట్టుకొని మరి తినాలి, ఎందుకంటే..?

యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బుల జాబితాలో మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు ఎక్కువగా ఉంటే.. అందులో ముందు వరుసలో ఉండేది మధుమేహమే. ఒక్కసారి మధుమేహం బారినపడ్డాకా.. రోజూ తినే ఆహారం, లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయిద్ది. అయితే షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. ఏవి తినాలి. ఏవి తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతుంది. కనీసం పండ్లు తినాలన్నా.. భయపడుతుంటారు. అలాంటివారు.. ఈ పండ్లను మాత్రం మరో ఆలోచన లేకుండా తినొచ్చు.

యాపిల్స్‌ని తినమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. కాబట్టి మధుమేహులు ఈ పండ్లని తినడం ముఖ్యం. ద్రాక్షపండ్లు.. మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో ద్రాక్షపండ్లు ముందుంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వుశాతం తగ్గుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు వీటిని తినొచ్చు. దానిమ్మపండు.. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఇందులో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి మధుమేహులు ఈ పండ్లను తినొచ్చు. పుచ్చకాయల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహులకు అంతమంచిది కాదు.. కానీ.. ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు. విటమిన్ సి కలిగిన పండ్లు డయాబెటిస్ పేషెంట్లకి ఎంతో మంచిది.

అందువల్ల కమలా పండ్లు తీసుకోవడం ముఖ్యమే. పియర్స్.. ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న పండ్లు డయాబెటీస్‌కి చాలా మంచిది. అయితే, పియర్స్ అనే పండ్లలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తినడం చాలా మంచిది. నేరేడుపండ్లు.. ఈ పండ్లని తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రో‌ల్‌లో ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈ పండ్లే కాదు.. వీటి గింజలను పౌడర్ చేసుకుని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

జామపండ్లు..విటమిన్ ఎ, సి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి. ఫిగ్(అంజీర్).. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లని తీసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker