Health

ఈ మొక్క ఆకులు తింటే పిల్లల్లో తెలివి తేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి.

పిల్లల్లో తెలివి తేటలు, జ్ఞాపక శక్తి పెరగాలన్నా పెద్దలు బ్రహ్మి ఆకు తినాలని చెబుతూ ఉండేవారు. రోజూ నాలుగు బ్రహ్మి ఆకులను నమిలి తింటే మెదడు పనితీరు మెరుగవుతుందని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం.. ఇలా అనేక రూపాల్లో లభిస్తుంది. ఈ మొక్కలను ఇంట్లోనే హాయిగా పెంచుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇందులో ఉండే మూలకాలు రక్తపోటు నియంత్రిస్తాయి.

అంతేకాకుండా శరీంలో వ్యాధులు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా గాయాలను నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే రక్త పోటు సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ ఆకులను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే కాలిన గాయాలను నయం చేసి, రక్త ప్రసరణను సక్రమంగా చేస్తుంది. అయితే రక్త ప్రసరణలో తీవ్ర సమస్యలు ఏర్పడుతే.. ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కావున ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా సరస్వతీ ఆకులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వీటి క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి ఫలితాలు లభిస్తాయి. సరస్వతీ ఆకులో చర్మాన్ని మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి ఔషధంగా పని చేస్తుంది. పెను ప్రాణాంతక సమస్యల నుంచి కూడా సులభంగా రక్షిస్తుంది. ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకునే వారికి మంచి ప్రోడక్ట్‌గా చెప్పవచ్చు. ఇది చెడు వ్యసనాలను దూరం చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker