News

జీవితంలో అన్నీ ఉన్నా అదొక్కటే లేదంటూ.. బాధపడుతున్న సమంత.

సమంత ఇప్పుడు తన అనారోగ్యం నుంచి బయటపడే దశలో ఉంది. తిరిగి రెట్టింపు ఎనర్జీతో, రెట్టింపు ఉత్సాహంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. ఓ వైపు కొంత ట్రోలింగ్‌, మరికొంత క్రేజ్‌తో వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన కొన్ని వార్తలు దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న సమంత..

అటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్ గా చెబుతూ ఉంటుంది. మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత.. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ వ్యాధికి విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్న ఈ బ్యూటీ.. తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా తన పర్సనల్ సీక్రెట్స్ కొన్ని చెప్పి షాకిచ్చింది సమంత. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటోంది సమంత. తనకంటూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకొని.. ఇష్టమైన ప్రదేశాలు చుట్టేస్తూ ఇష్టమైన పనులు మాత్రమే చేస్తోంది. ప్రకృతితో మమేకం అవుతూ అందిరికీ దూరంగా ఉంటోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మరింత యాక్టివ్ అయింది.

అంతేకాదు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఎవ్వరిపై డిపెండ్ కావడం సరికాదన్నట్లుగా పోస్టులు పెడుతోంది. పలు కొటేషన్స్ షేర్ చేస్తూ తనలోని ఫీలింగ్స్ బయటపెడుతోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. తిరిగి పూర్తి ఎనర్జీతో సినిమాల్లోకి రావాలని ఆమె భావిస్తోందట. అయితే ఇప్పటికే తమిళ స్టార్ ఏరో విజయ్ తో ఓ సినిమా చేయడానికి ఆమె సైన్ చేసిందనే టాక్ అయితే ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker