News

సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా నిల్చోవాలన్న రోజా. షాకింగ్ వీడియో వైరల్!

తమిళనాడులోని తిరెచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం రోజు వరుణాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి తన భర్త అయిన సెల్వమణితో కలిసి హాజరైన మాజీ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకున్నారు. రోజా సినీ సెలబ్రిటీ కావడంతో అక్కడ ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు.

అయితే తనను సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన వరుషాభిషేకంలో రోజా, ఆమె భర్త సెల్వమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తుల్లో చాలామంది ఆసక్తి కనబరిచారు.

అదే సమయంలో అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ కోసం రోజా వద్దకు వెళ్లగా దూరంగా నిల్చోవాలని చేయి చూపిస్తూ రోజా చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు కొంత దూరం జరిగి ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker