Health

సంవత్సరం వరకు బియ్యం పురుగు పట్టకుండా ఉంచే సులభ చిట్కాలు.

బియ్యానికి పురుగులు ప‌ట్ట‌కుండా అడ్డ క‌ట్ట వేయ‌డంలో ఇంగువ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.బియ్యంలో కొద్దిగా ఇంగువ‌ను వేసి బాగా క‌లుపుకోవాలి.ఇలా చేస్తే ఇంగువ నుంచి వెలువ‌డే ఘాటైన వాస‌న‌కు పురుగులు రాకుండా ఉంటాయి. బియ్యానికి పురుగులు ప‌ట్ట‌డానికి తేమ కూడా ఒక కార‌ణంగా చెప్పుకొచ్చు.

అయితే రోజు అన్నం తింటాము కాబట్టి ఎక్కువ మోతాదులో మనం బియ్యాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాము అయితే బియ్యాన్ని ఎక్కువగా తెచ్చుకుని ఇంట్లో పెట్టడం వలన సమస్య ఉండదు కానీ బియ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి బియ్యానికి పురుగులు పట్టొచ్చు ఎక్కువ మోతాదులో బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని వాటిని పాడు చేసుకుంటే డబ్బులు వృధా తప్ప ఫలితం ఉండదు పైగా ఒకసారి పురుగులు పట్టాయి.

అంటే వాటిని వేరు చేయడం కష్టంగా ఉంటుంది. పురుగుల వలన రకరకాల సమస్యలు కూడా కలగొచ్చు అయితే ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కాలని ట్రై చేయండి. ఇలా చేస్తే బియ్యానికి పురుగులు పట్టవు. బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇంగువని మూట కట్టి బియ్యం డబ్బాలో పెడితే ఆ ఘాటుకి పురుగులు చేరకుండా ఉంటాయి అలానే పురుగులు పట్టకుండా ఉండాలంటే కర్పూరాన్ని కూడా ఇదే విధంగా మూటకట్టి పెట్టండి అప్పుడు పురుగులు పట్టవు.

వేపాకు కూడా బియ్యానికి పురుగులు చేరకుండా చూసుకుంటుంది. బియ్యాన్ని నిలువ చేసుకునే డబ్బా లో వేపాకులను వేస్తే బియ్యానికి పురుగులు పట్టవు. వేపాకు పొడిని కూడా మీరు ఉపయోగించవచ్చు. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి బియ్యంలో ఉంచితే కూడా బియ్యానికి పురుగులు పట్టవు. లవంగాలను కూడా మీరు వెయ్యొచ్చు.

లవంగాలు పొడి చేసి ఒక చిన్న క్లాత్లో కట్టి బియ్యం డబ్బాలో పెడితే పురుగులు పట్టవు. ఒక చిన్న క్లాత్ లో కొంచెం ఉప్పును వేసి మూటకట్టి బియ్యం లో ఉంచితే కూడా పురుగులు పట్టకుండా ఉంటాయి. కాకరకాయల ముక్కల్ని ఎండబెట్టి వాటిని పొడి చేసి మూటకట్టి బియ్యం డబ్బాలో పెడితే పురుగులు పట్టవు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker