News

పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశా అని సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.

తెలుగులో వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్ లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది రేవతి. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ స్టార్స్ కు తల్లిగా కూడా నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్న రేవతి చేసిన వ్యాక్యలు వైరల్ అవుతున్నాయి. అయితే రేవతి.. 90వ దశకంలో తన నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. డైరెక్టర్ రేలంగి నరసింహరావు తెరకెక్కించిన ‘మానసవీణ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘గాయం’లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి క్యారెక్టర్లు చేస్తూ.. బిజీగా ఉంటోంది. లోఫర్, సైజ్ జీరో, మేజర్ లాంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది. ఇక దర్శకురాలిగా కూడా తనదైన ముద్రవేసుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవతి.. తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “నేను 17 సంవత్సరా వయసులోనే నటించడం ప్రారంభించాను.

మూడు ఏళ్లు నటించిన తర్వాత 20 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాను. వివాహం తర్వాత ఏడాది పాటు నటించలేదు. కానీ ఆ తర్వాత ఇష్కీ వాసల్, దేవర మగన్ లాంటి మంచి చిత్రాలు చేశాను. పెళ్లి తర్వాత చాలా సినిమాలు చేయలేకపోయాను. దాంతో ఇంత త్వరగా పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాననిపించింది. ఎన్నో మంచి మూవీలు చేసిన తర్వాత వివాహం చేసుకుంటే బాగుండేదనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది రేవతి. 1966 జూలై 8న కొచ్చిలో జన్మించిన రేవతి.. మాతృభాష మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తూ.. ఇండస్ట్రీలో రాణిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker