హీరో రాజ్ తరుణ్ కేస్ లో బిగ్ ట్విస్ట్, హీరోయిన్ పై హత్యాయత్నం.
హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చుస్తున్నాడని.. శారీరకంగా వాడుకుని మోసం చేశాడని లావణ్య తెలిపింది. గుడిలో మాకు రహస్య వివాహం జరిగిందని.. రాజ్ తరుణ్ రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఇక లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ1, ఏ 2, ఏ 3గా నమోదు చేశారు. రాజ్ తరుణ్కి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా..
మాల్వి మల్హోత్రా మీద అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మాల్వి తనన కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసింది అని ఆరోపించింది. ఇక తాజాగా ఈ అంశంలో మరో కీలక విషయంలో వెలుగులోకి వచ్చింది. మాల్వి మల్హోత్రా మీద కత్తితో అటాక్ చేశారని.. మూడు సార్లు కత్తితో పొడిచారని.. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారని వెలుగులోకి వచ్చింది. ఇక తాజాగా యోగేష్ తల్లి.. మాల్వి మల్హోత్రా మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మాల్వికి, తన కొడుకు యోగేష్కు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరూ ఒక కేఫ్ హౌస్లో కలిశారని.. ఆ పరిచయం అలా పెరిగి.. ఇద్దరూ ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది. ఇద్దరూ కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారని.. ఆ తర్వాత ఇద్దరికి గొడవలు రావడంతో.. విడిపోయారని యోగేష్ తల్లి చెప్పుకొచ్చింది. ఇలా ఉండగా.. ఈ వివాదం నేపథ్యంలో యోగేష్.. మాల్వి మీద కత్తితో దాడి చేశాడని తెలిసింది. ఇక మాల్విపై దాడి జరిగింది ఇప్పుడు కాదు.. సుమారు 4 సంవత్సరాల క్రితం అనగా.. 2020 అక్టోబర్లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది.
ఆమె మీద దాడి చేసింది ఎవరో కాదు యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్.. మాల్విపై ఒత్తిడి తెచ్చాడు. కానీ ఆమె అంగీకరించలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేష్.. మాల్విని కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మాల్విని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.