కిరాణా షాప్ లో పేటీఎం QR కోడ్ స్కాన్ చేస్తున్నారా..? మీరు వెంటనే ఆపేయండి, ఎందుకంటే..?
పేటీఎం పేమెంట్ ఈనెల 29 తరవాత ముఖ్య కార్యకలాపాలు జరపకుండా ఆర్బీఐ నిషేధించిందని.. ఈ పరిణామాలతో సంబంధమున్న ఇద్దరిని ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. సాధారణంగా పీఈపీలు రాజకీయ నాయకులతో లేదా సీనియర్ అధికారులతో సంబంధమున్న వారై ఉంటారు. అయితే పేటీఎం మొబైల్ పేమెంట్ యాప్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దేశంలోని కిరాణా స్టోర్లలో దాదాపు సగం పేటీఎంకు దూరమయ్యాయి.
42 శాతం కిరాణా వ్యాపారులు పేటీఎంకు బదులుగా ఇతర మొబైల్ పేమెంట్ యాప్స్ను వినియోగిస్తున్నట్టు కిరాణా క్లబ్ చేసిన ఓ తాజా సర్వేలో తేలింది. అంతేగాక 68 శాతం కిరాణా వ్యాపారుల్లో పేటీఎంపై నమ్మకం సన్నగిల్లినట్టు కూడా సదరు సర్వే చెప్పింది. ‘ఆర్బీఐ ఆంక్షలు తమ లావాదేవీలను ఆటంకపర్చవచ్చని కిరాణా వ్యాపారులు భయపడుతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఇతర మొబైల్ పేమెంట్ యాప్స్ను వాడుతున్నారు’ అని కిరాణా క్లబ్ వ్యవస్థాపక సీఈవో అన్షుల్ గుప్తా అన్నారు.
పేటీఎంకు ప్రత్యామ్నాయ పేమెంట్ ఆప్షన్స్ కూడా బాగానే ప్రాచుర్యంలో ఉండటం.. కిరాణా స్టోర్లకు ఇప్పుడు దిగులు లేకుండా పోయిందని చెప్పారు. కాగా, తమ దుకాణాల్లోకి వచ్చే కస్టమర్లను పేటీఎం మినహా మరే ఇతర పేమెంట్ మొబైల్ యాప్నైనా వాడండి అంటూ కిరాణా వ్యాపారులు సలహా ఇస్తున్నట్టు కూడా ఇంకొందరు చెప్తుండటం గమనార్హం. ఈ సర్వేలో మొత్తం 5వేల మంది కిరాణా వ్యాపారుల అభిప్రాయాలను కిరాణా క్లబ్ తీసుకున్నది.
తమ ఈ-కామర్స్ విభాగం పేరును పై ప్లాట్ఫామ్స్గా మార్చింది పేటీఎం. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వివరాల ప్రకారం తెలుస్తున్నది. కొద్ది నెలల క్రితమే ఈ పేరు మార్పు కోసం పేటీఎం విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తున్నది.