Health

నోటి దుర్వాసన వస్తుందా..? మీరు వెంటనే పనులు చెయ్యండి చాలు.

చాలా మంది పడుకుని లేవగానే వారి నోరు కంపు కొడుతుంది. బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన సమస్య పోదు. ఇలా జరగడానికి ప్రధాన కారణం.. నోటిలో లాలాజలం లేకపోవడమే. మనం రాత్రి పడుకున్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నోరు పొడిబారుతుంది. ఈలాలాజలం సాధారణంగా దుర్వాసన కలిగించే కణాలను బటయకి పంపుతుంది. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. నోటి సంరక్షణ, పరిశుభ్రతకి ఇంతకంటే గొప్ప ఔషధం మరొకటి ఉండదు. పసుపులో కర్కుమిన్ అనే ఆర్గానిక్, నాన్ టాక్సిక్ రసాయన సమ్మేళనం ఉంది.

ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగానే పసుపు పీరియాంటల్ వ్యాధులు, నోటి క్యాన్సర్‌ల చికిత్సకు అత్యంత ప్రభావవంతమైన పదార్ధంగా మారింది. ఇది మౌత్ వాష్, దంతాల తెల్లబడేలా చేసేందుకు సహకరిస్తుంది. పసుపు కలిపిన నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పసుపు నీళ్ళు ఎలా తయారు చేసుకోవాలి..పసుపు నీటితో నోరు పుక్కిలించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. వాటిని తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. ఒక గ్లాసు కోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ½ టీ స్పూన్ పసుపు వేసుకుని 2 చిటికెళ్ల నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి.

లేదంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకుని అందులో పసుపు వేసి బాగా మరిగించుకోవచ్చు. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు సాధారణ ఉప్పు కొద్దిగా కలుపుకోవచ్చు కూడా. పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటిని పుక్కిలిస్తే నోరు రోజంతా తాజాగా ఉంటుంది. పసుపు నీళ్ళతో ప్రయోజనాలు.. పసుపు నీటిని పుక్కిలించడం వల్ల నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటిలో పుండ్లు ఏవైనా ఉండి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఈ నీటిని కొద్ది సేపు నోట్లో ఉంచుకుని పుక్కిలించడం వల్ల వారంలోనే అద్భుత ఫలితాలు పొందవచ్చు. మౌత్ ఫ్రెషనర్ గా..పసుపు నీరు మౌత్ ఫ్రెషనర్ గాను ఉపయోగపడుతుంది.

నోటి దుర్వాసన పోగొట్టి మంచి వాసన వచ్చేలా చేయడంలో సహాయపడుతుంది. నోట్లో ఉండే వైరస్, చెడు బ్యాక్టీరియాని చంపుతుంది. చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం.. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో ఎక్కువ మంది గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాదు సీజనల్ గా వచ్చే జలుబు, ఫ్లూ బారిన పడినప్పుడు కూడా నిరంతరం గొంతు నొప్పి వేధిస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితితో బాధపడే వాళ్ళకి పసుపు నీళ్ళు ఉపశమనం కలిగిస్తాయి. రోజుకి రెండుసార్లు వీటిని తీసుకోవడం వల్లఅ తక్షణ ఫలితాన్ని అనుభవిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker