Health

పల్లీలు తిని నీటిని తాగుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

ప‌ల్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను కూడా తిన‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, పాస్ఫ‌ర‌స్, మెగ్నీషియం, ఐర‌న్, విట‌మిన్ బి, ఆమైనో యాసిడ్లు వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కండ‌రాలు ధృడంగా, ఆరోగ్య‌వంతంగా ఉంటాయి.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. అయితే పల్లీలు ఇష్టపడని వారుండరు. వేపుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనబ‌డగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు.

పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు. తాగితే సమస్యెందుకు వస్తుంది. పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

పల్లీలు తినగానే నీళ్లు తాగొద్దు అనడానికి గల మరో కారణం.. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి.

చివరిగా మరో కారణం ఏమిటంటే.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడతాయి. కనుక పల్లీలను తినగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండడం ఉత్తమం. అప్పుడు కూడా వేడి నీరు తాగాల్సి ఉంటుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker