Health

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కూరగాయలు తినకపోవడమే మంచిది, ఎందుకంటే..?

రోజంతా కష్టపడి చివరకు మీరు ఎంతసేపు విశ్రమించారన్నదే మీ ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో ఇది మరీ ముఖ్యం. రోజు మొత్తంలో కంటే చాలా మందికి సాయంత్రం కాస్త రిలాక్స్‌గా ఉంటుంది. ఈ సమయాన్ని మీరు మరుసటి రోజు ప్లానింగ్‌కు ఉపయోగించుకుంటే మీ ఒత్తిడిస్థాయిని మరింత తగ్గించుకోవచ్చు. డయాబెటిస్‌కు కారకంగా నిలిచే ఒత్తిడి తగ్గినట్టవుతుంది. అయితే ఈ రోజుల్లో డయాబెటిస్‌ చాలా మందిని వెంటాడుతొంది. ఒక్కసారి డయాబెటిస్‌ వచ్చిందంటే చాలు జీవితంతం జాగ్రత్తగా ఉండాలి.

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప పూర్తిగా నివారించలేము. అయితే మధుమేహం ఉన్నవారు ముఖ్యంగా ఆహార నియమాలలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. కొన్ని కూరగాయాలు ఎక్కువగా తీసుకుంటే మరికొన్ని కూరగాయాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటిక్ పేషెంట్లు కొన్ని కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ఏ కూరగాయలను చేర్చుకోకపోవడం మంచిది. బంగాళదుంపలకు దూరం ఉండండి. బంగాళదుంపల వినియోగం మధుమేహ రోగుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంగాళాదుంపలు చాలా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయన్నట్లు. ఇది కాకుండా బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి హానికరమని చెబుతున్నారు వైద్య నిపుణులు.

మొక్కజొన్న తినవద్దు.. మొక్కజొన్న గ్లైసెమిక్ ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. దీనిని తినాలని అనుకుంటే తినాలనుకుంటే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో కలుపుకుని తినండి. బఠానీలు తినడం మానుకోండి.. బఠానీలలో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయట. అందుకే ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది.

మధుమేహం ఉన్నవారు వీటిని దూరంగా ఉండటం మంచిది. కూరగాయల రసం తాగవద్దు.. పచ్చి కూరగాయల రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఈ పానీయంలో ఫైబర్ లోపం చాలా ఉంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ జ్యూస్ తాగే బదులు వాటిని డైట్ లో చేర్చుకుంటే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker