Health

ఈ ఆయుర్వేద చిట్కాలతో పొడి దగ్గుకు శాశ్వత పరిష్కారం.

సాధారణంగా దగ్గు ఒక వ్యక్తిని రెండు విధాలుగా ఇబ్బంది పెడుతుంది. మొదటి కఫం దగ్గు ఇందులో శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది. రెండోది పొడి దగ్గు ఇందులో శ్లేష్మం ఉండదు కానీ గొంతులో నొప్పి, మంట ఉంటుంది. చాలా సార్లు దగ్గడం వల్ల వ్యక్తి పక్కటెముకలు కూడా గాయపడుతాయి. అయితే పొడి దగ్గు ఎక్కువగా వేధిస్తున్నప్పుడు ఆయుర్వేదం సులువైన చిట్కాలను చెబుతోంది. దగ్గు 5 నుంచి వారం రోజుల్లో సాధారణంగా తగ్గిపోతుంది. అలాకాకుండా నాలుగు నుంచి ఆరు వారాలపాటు కొనసాగుతుందంటే దాన్ని సుదీర్ఘ దగ్గుగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఒక క్రానిక్ డిసీజ్. సాధారణ దగ్గు మందులకు ఈ సుదీర్ఘమైన దగ్గు తగ్గదు.

కాబట్టి ఈ దగ్గును తగ్గించేందుకు ఆయుర్వేదం కొన్ని చిట్కాలు చెబుతోంది. కాలుష్యం వల్ల, నాణ్యత లేని గాలి వల్ల కూడా రావచ్చు. ఇది మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అల్లం టీ.. అల్లంలో శోథనిరోధక లక్షణాలు అధికం. పొడి దగ్గును, దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గును తగ్గించేందుకు నీటిలో అల్లం తరుగును వేసి మరిగించాలి. ఆ టీని వడకట్టి గ్లాసులో వేయాలి. తాగే ముందు ఒక స్పూను తేనెను కలపాలి. ఈ టీని రోజుకి రెండు మూడు సార్లు తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది. తేనే సహజంగానే దగ్గును అణిచివేసే లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు పాలు.. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికం.

కాబట్టి దీర్ఘకాలం పాటు వేధిస్తున్న దగ్గును వదిలించుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం. గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్ పసుపు పొడిని వేసి బాగా కలిపి నిద్రపోవడానికి ముందు తాగాలి. దీన్నే ‘గోల్డెన్ మిల్క్’ అని కూడా పిలుస్తారు. వెల్లుల్లి.. దగ్గును తగ్గించే గొప్ప లక్షణం వెల్లుల్లిలో ఉంది. పాలలో ఒక వెల్లుల్లి రెబ్బను వేసి మరిగించాలి. దానికి చిటికెడు పసుపు కూడా జోడించాలి. ఈ పానీయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. పొడి దగ్గుకు ఇది సరైన చికిత్స. చల్లారాక తాగడం వల్ల ఫలితం ఉండదు.

తులసి టీ.. పవిత్రమైన తులసిలో యాంటీ టస్సివ్ లక్షణాలు ఉంటాయి. ఇది పొడి దగ్గును తగ్గించడంలో సహాయపడతాయి. తులసి ఆకులను కొన్ని నిమిషాలు నీటిలో వేసి మరిగించాలి. ఆ టీ ని వడకట్టి టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా ఈ టీ ని రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఎంతో ప్రయోజనం. ఉప్పునీరు..ప్రాచీన కాలం నుంచి దగ్గుకు ఉత్తమ పరిష్కారంగా చెబుతున్నది పుక్కిలించడం. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని ఆ నీటితో గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఆ నీటిని తాగకుండా ఉమ్మేయాలి.

లికోరైస్ రూట్.. ఆయుర్వేదంలో లైకోరైస్ మొక్క వేరుకు ప్రాధాన్యత ఉంది. ఈ లైకోరైజ్ వేరు పొడిని, దగ్గును తగ్గించడానికి వినియోగిస్తారు. నీటిలో కొన్ని నిమిషాల పాటు ఈ లికోరైజ్ వేరును నానబెట్టి తర్వాత వడకట్టి తాగితే మంచిది. లేదా గోరువెచ్చని నీటిలో లికోరైస్ వేరు పొడిని కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తాగినా పొడి దగ్గు పోతుంది. అయితే ఈ వేరును గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం తీసుకోకూడదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker