ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ డైరెక్టర్, షాక్ లో అగ్రహీరోలు, పోలీసులు ఏం చెప్పారంటే..?
డైరెక్టర్..గత రెండు రోజులుగా ఆయన ఇంటి ఇరుగుపొరుగు వారికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు ప్రకాశ్ ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటి లోపల శవమై కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియ రాలేదు. డైరెక్టర్ ప్రకాశ్ కొలేరి మృతిపట్ల మలయాళ సిని పరిశ్రలో తీవ్ర విషాదం నెలకొంది.
పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకులు ప్రకాశ్ కొలేరి (65) కేరళలోని వాయనాడ్ లో తన నివాసం లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన వాయినాడ్ లోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. రెండు రోజులుగా ఆయన బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం రావడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన విగతజీవిగా కనిపించారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు. ప్రకాశ్ కొలేరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రకాశ్ కొలేరి 1987 లో తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘మిజియితలిల్ కన్నిరుమయి’ హిట్ టాక్ తెచ్చుకోవడమేకాదు.. ఆయనకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది.
1999 లో రిలీజ్ అయిన ‘వరుణ్ వారథిరికిల్ల’ మూవీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అవన్ ఆనందపద్మనాభన్, వరుమ్ వరతిరికిల్ల ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత 2013లో ‘పాట్టు పుస్తకం’ మూవీకి దర్శకత్వం వహించారు. ఇదే ఆయన కెరీర్ లో చివరి చిత్రం. దర్శకుడిగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్, నటుడిగా సత్తా చాటారు. ప్రకాశ్ కొలేరి మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.