News

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అరెస్ట్. అదుపుతప్పిన పరిస్థితులు. అసలు ఏం జరిగిందంటే..?

నందికొట్కూరు బంద్ పాటిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఈ సందర్భంగా నంద్యాలలోని ముచ్చుమర్రి బాలిక అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. ఇక ఈ బంద్ మద్దతిచ్చాయి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించాయి విద్యార్థి సంఘ నాయకులు. అయితే రాష్ట్ర శాప్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వాసంతి తల్లిదండ్రులను పరామర్శించేందుకు శుక్రవారం కర్నూలు నుండి ముచ్చుమర్రి గ్రామానికి వెళ్తున్నారు.

అయితే బ్రాహ్మణ కొట్కూరు గ్రామం వద్దకు చేరుకోగానే బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని నందికొట్కూరు రూరల్ సీఐ ఓ విజయ భాస్కర్, బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ నాగార్జున, జూపాడుబంగ్లా ఎస్ఐ లక్ష్మీనారాయణలు తమ సిబ్బందితో కలిసి ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. అయితే సిద్దార్థ రెడ్డి వినకుండా తమ గ్రామానికి వెళ్ళి వాసంతి తల్లిదండ్రులను పరామర్శించి వస్తానని చెప్పినా సీఐ, ఎస్ఐ లు వినకుండా అడ్డుకున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానంతో సిద్దార్థ రెడ్డిని అరెస్టు చేసి బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సొంత గ్రామానికి వెళ్ళి వాసంతి తల్లిదండ్రులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని, సిద్దార్థ రెడ్డిని వెంటనే ముచ్చుమర్రి గ్రామానికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker