News

ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా..? ఈ బ్యూటీ ఇలా మారిందేంటీ..?

హీరోయిన్స్ సహజ నటనతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే వివిధ కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే పలువురు తారలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా.. మరికొందరు హీరోయిన్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. అందులో కామ్నా జెఠ్మలానీ ఒకరు. కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబరు 10న ముంబైలో జన్మించింది.

తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ. అయితే మెదట్లో గ్లామరస్ పాత్రలు ఎక్కువగా చేసినప్పటికీ విమర్శలు తావివ్వకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలక్ట్ చేసుకుంది. సినిమాలకు తగ్గట్లే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన కామ్నా జెఠ్మలానీ ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యింది.

రణం సినిమా తర్వాత జగపతి బాబుకు జోడీగా సామాన్యుడు సినిమాలో నటించింది. వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోయిన ఈ బ్యూటీకి ఆ తర్వాత అంతగా సక్సెస్ రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. 2014లో బెంగుళూరుకు చెందిన బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చాలా కాలంపాటు సైలెంట్ అయిన కామ్నా జెఠ్మలానీ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.

నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. అటు ఫ్యామిలీ ఫోటోస్, ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా కామ్మా జెఠ్మలానీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇటీవలే వ్యవస్థ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది ఈ హీరోయిన్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker