శ్రీరెడ్డి బంపర్ ఆఫర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతా : శ్రీరెడ్డి
వైఎస్ జగన్ ఓటమి తర్వాత శ్రీరెడ్డి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ముందునుంచే జగన్ కు మద్దతుగా నిలుస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు మళ్ళీ సెన్సేషన్ అవుతోంది. ఈ సారి ఎన్నికల ఫలితాల్లో కూటమికి పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబుకు ఇమ్మడి ముమ్మడిగా ఓట్లు గుద్దేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. దీంతో అధికార పక్షం గద్దె దిగింది.
అయితే జగన్ మోహన్ రెడ్డి కి వీరాభిమాని అయిన శ్రీరెడ్డి తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 164 స్థానాల్లో గెలిచింది. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అయితే జగన్ మోహన్ రెడ్డి కి మద్దతుగా శ్రీరెడ్డి వరుస పోస్టులు చేస్తుంది.
అయితే తాజాగా శ్రీరెడ్డి ‘ బాధపడకు జగనన్న .. క్యాడర్ కు కొత్త ఊపిరి పోయాలి. నిలబడు, పోరాడు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ అందరి కోసం బలం తెచ్చుకో .. ఇక రోజూ ఒక పోరాటమే .. విజయం ఉన్న వాళ్ళ వైపు జారబడే వాళ్ళు ఎక్కువ. వెక్కిరించే వెధవల కోసం కాదు .. నీ సైన్యం కోసం పోరాడాలి అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే కొందరు శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆమెకు సంబంధించిన పోస్ట్ ఒకటి వైరల్ చేస్తున్నారు. ‘ జగనన్న ఈ ఎన్నికల్లో గెలవక పోతే బీచ్ లో బట్టలు విప్పేసి తిరుగుతా ‘ అని శ్రీరెడ్డి గతంలో వేసిన పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు. జగన్ ఓడిపోయాడుగా ఇప్పుడు నిజంగానే బట్టలు విప్పేసి తిరుగు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వల్గర్ కామెంట్స్ కి శ్రీరెడ్డి తన స్టైల్ లో ఇచ్చిపడేసింది. ‘ తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పుతో కొడతా. బట్టలు విప్పేసి తిరుగుతా అని నేనెప్పుడు అన్నానురా. ల … లారా అంటూ ఘాటుగా జవాబిచ్చింది.