తరుణ్, ప్రియమణిల పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరో తెలుసా..?
తరుణ్ , ప్రియమణి ప్రేమలో ఉన్నారని చాలామంది చెప్పుకున్నారు. అంతేకాదు మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు కూడా తెగ చెక్కర్లు కొట్టాయి. అయితే అసలు ప్రియమణి, తరుణ్ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారబ్బా అనుకుంటున్నారా..? ఇదంతా కొన్నేళ్ల కింద జరిగింది. తరుణ్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే ఇలాంటి చిత్రాలు చాలానే జరిగాయి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ అంటే తరుణ్ అనేవాళ్లు. మిలీనియం మొదట్లో సంచలనాలు సృష్టించాడు ఈ హీరో.
నువ్వే కావాలి అంటూ వచ్చి వరస విజయాలు అందుకున్నాడు. స్టార్ హీరో అయ్యాడు.. ఒకానొక సమయంలో లవర్ బాయ్ అనే బ్రాండ్కు అంబాసిడర్గా ఉండేవాడు తరుణ్ కుమార్. హీరోగా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఇతను. అయితే ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపులతో పూర్తిగా కనిపించకుండా పోయాడు. అయితే తరుణ్ కెరీర్లో చెప్పుకోదగ్గ ప్రేమకథలు కూడా చాలానే ఉన్నాయి. అప్పట్లో ఈయన ఓ హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు చాలానే వచ్చాయి.
ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ కూడా ఈయన్ని పెళ్ళి చేసుకోవాలనుకుందని.. ఆయన నో చెప్పేసరికి ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రియమణితో కూడా తరుణ్ ప్రేమాయణం కొనసాగించాడని వార్తలు వచ్చాయి అప్పట్లో. ఈ ఇద్దరూ కలిసి నవ వసంతం సినిమాలో నటించారు. ఆ సినిమాలో నటిస్తున్న పసమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలొచ్చాయి. కలిసి పార్టీలకు వెళ్లారు.. అప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరూ కనిపించేవారు. అది చూసి తరుణ్ అమ్మ రోజా రమణి ఒక రోజు సెట్స్కు వచ్చి మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు..
పెళ్లి చేస్తానంటూ ఆఫర్ చేసింది. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు ప్రియమణే. అప్పట్లో తమ ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి తరుణ్ వాళ్ల అమ్మ కూడా తప్పుగా అర్థం చేసుకుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ తరుణ్ వాళ్ల అమ్మ అలా చెప్పగానే మీరు అపార్థం చేసుకున్నారని చెప్పినట్లు తెలిపింది ప్రియమణి. అలా చెప్పిన తర్వాత ఆ విషయం అక్కడితోనే మరిచిపోయామని.. కానీ అప్పట్లో తరుణ్ను వాళ్ల అమ్మగారు పెళ్లి చేసుకోమ్మని మాత్రం అడిగారని చెప్పింది.
అప్పుడు తాను ఓకే చెప్పుంటే ఈ రోజు తరుణ్ భార్య అయిపోయేదాన్ని అంటుంది ప్రియమణి. ఇదిలా ఉంటే 2017లో ముస్తాఫా రాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్ళి తర్వాత కూడా కెరీర్లో వరస అవకాశాలు అందుకుంటుంది ప్రియమణి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తోంది. ఇక తరుణ్ హీరోగా ఫేడేట్ అయ్యాకా.. ఇపుడు ఓ వెబ్ సిరీస్తో నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు వాళ్ల అమ్మ రోజా రమణి చెప్పారు. అంతేకాదు త్వరలోనే తరుణ్ పెళ్లి చేయబోతున్నట్టు చెప్పింది.