చిత్రపరిశ్రమలో విషాదం. వందేళ్ల వయసులో కన్నుమూసిన హీరోయిన్.
నటి స్మృతి బిశ్వాస్కు 100 ఏళ్లు ఉంటాయి. ఆమె నాసిక్ రోడ్ ప్రాంతంలో ఒక గది-వంటగది అద్దెకు తీసుకున్న ఫ్లాట్లో నివసిస్తున్నారు. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రఖ్యాత వృత్తిని ప్రారంభించింది. గురుదత్, వి శాంతారామ్, మృణాల్ సేన్, బిమల్ రాయ్, బిఆర్ చోప్రా, రాజ్ కపూర్ వంటి ప్రముఖ చిత్రనిర్మాతల చిత్రాలలో కనిపించింది. అయితే ప్రముఖ నటి స్మృతి బిశ్వాస్ (100) మహారాష్ట్రలోని నాసిక్ లో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
గత కొంత కాలంగా ఆమె వృద్దాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జులై 3న కన్నుమూశారు. స్మృతి బిశ్వాస్ హింది, మరాఠి, బెంగాలీ భాషల్లో నటించారు. స్మృతి బిశ్వాస్ 1930 నుండి 1960 వరకు మూడు దశాబ్దాల పాటు ‘నేక్ దిల్’, ‘అపరాజిత’, ‘మోడరన్ గర్ల్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. రాజ్ కపూర్, కిషోర్ కుమార్, భగవందాదా, నర్గీస్, బల్ రాజ్ సాహ్ని వంటి నటులతో దాదాపు 90 చిత్రాలలో స్మృతి బిస్వాస్ నటించింది.కెరీర్ లో ఆమె ఎన్నో అవార్డులు, రివార్డులతో సత్కరించబడ్డాడు. ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే గోల్డెన్ ఎరా’ అవార్డుతో సత్కరించారు.
స్మృతి బిస్వాస్ భర్త నారంగ్ డా ఎస్డి నారంగ్ అలియాస్ రాజా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు. అతను 25 జనవరి 1986న అనారోగ్య సమస్యలతో మరణించాడు. భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న ఆమె నాసిక్లోని ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. 28 ఏళ్ల క్రితం ఊరు మారిన స్మృతి బిస్వాస్ క్రిస్టియన్ మిషనరీగా పనిచేస్తున్న తన సోదరి ఆధ్వర్యంలో ముంబై నుంచి నాసిక్లో స్థిరపడింది. ఆమె మృతికి చిత్ర నిర్మాత హన్సల్ మెహతా ఇన్స్టాగ్రామ్లో సంతాపం తెలిపారు.